News February 26, 2026

పశ్చిమగోదావరి జడ్పీలో సిబ్బంది కొరత (1/2)

image

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌, జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎంపీడీవో కార్యాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేమి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News

News April 14, 2026

బాపట్ల: ఫై‌ఓవరపై దొరికిన వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి

image

బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుంటూరు రహదారి ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలితం లేక మరణించాడని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2026

గొప్ప ఆర్థికవేత్త అంబేడ్కర్!

image

భారత రాజ్యాంగ నిర్మాతగా అందరికీ తెలిసిన Dr.BR అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం ఆయన రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం IND, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడింది. దేశంలో RBI ఏర్పాటుకూ సహకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ, భారతీయులను ఆర్థిక బానిసలుగా మార్చిన తీరును తన పరిశోధనలతో ప్రపంచానికి చాటారు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి.

News April 14, 2026

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. రూ. 7 లక్షలు హాంఫట్!

image

విజయవాడలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడికి ఫోన్ చేసిన దుండగులు.. అతని ఆధార్ నంబర్‌కు మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉందని భయపెట్టారు. తాము పోలీసులమని నమ్మబలికి, కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుడు రూ. 7 లక్షలు సమర్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.