News March 28, 2024

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 10 చెక్‌పోస్టులు

image

పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల ఉన్న చెక్‌పోస్ట్‌లను ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 10 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా  24 గంటలు తనిఖీ చేసే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని అన్నారు. ఒకవేళ అవసరం అయితే ఆధారాలు తప్పక చూపించాలని సూచించారు.

Similar News

News January 20, 2025

బిహార్‌కు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ RRR

image

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.

News January 20, 2025

భారత జట్టుకు ఏలూరు ఎంపీ శుభాకాంక్షలు

image

ఖోఖో ప్ర‌పంచ‌క‌ప్‌ పోటీల్లో విజేతగా నిలిచిన భార‌త జట్టుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లోనే భారత మహిళలు, పురుషుల జట్లు విశ్వవిజేతలుగా నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.

News January 20, 2025

ఏలూరు: ప్రియుడి ఇంటి ముందు ధర్నా

image

ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె వివరాల ప్రకారం.. బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెళ్లి చేసుకోమని అడిగితే దుర్భాషలాడి దాడి చేశారని.. తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది.