News August 26, 2024
పసికందు ప్రాణం కాపాడిన MLA బొలిశెట్టి

తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ నెల వయసున్న బిడ్డ ప్రాణాన్ని కాపాడారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్-జ్యోత్స్న దంపతులకు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో బిడ్డ జన్మించింది. ఆ పసికందుకు వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే ప్రాణాపాయమని వైద్యులు చెప్పారు. దీంతో ఆ దంపతులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో స్పందించిన ఆయన ఆపరేషన్ చేయించారు.
Similar News
News December 18, 2025
రైతు బజార్లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

భీమవరం రైతు బజార్లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.
News December 18, 2025
రైతు బజార్లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

భీమవరం రైతు బజార్లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.
News December 17, 2025
ప.గో: మరణంలోనూ వీడని బంధం

జీవితాంతం కలిసి నడిచిన ఆ దంపతులను మరణం కూడా విడదీయలేకపోయింది. తాడేపల్లిగూడెం (M) ఆరుగొలనుకు చెందిన మలకా అబద్ధం(75) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భర్త వియోగాన్ని తట్టుకోలేక బుధవారం సాయంత్రం భార్య లక్ష్మి(65) కూడా తుదిశ్వాస విడిచింది. దంపతులు ఇద్దరూ గంటల వ్యవధిలో మరణించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.


