News January 19, 2025

పాకలలో నలుగురు మృతి.. అసలు కారణం ఇదే.!

image

పాకల బీచ్‌లో 2 రోజుల క్రితం సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. పాకల బీచ్‌లో ఉన్న చిన్నచిన్న గుంతల కారణంగా కడ్సలు (సుడిగుండాలు) ఏర్పడుతాయని, వీటిలో చిక్కుకున్న వారు బ్రతకడం కష్టమని మత్స్యకారులు తెలిపారు. శివన్నపాలెం గ్రామానికి చెందిన నవ్య సమయస్ఫూర్తితో వ్యవహరించి కడ్సల బారి నుంచి తప్పించుకుందని వారు తెలిపారు.

Similar News

News February 13, 2025

ఒంగోలు: ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష

image

లారీని అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2019లో పోతవరం కుంట వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఆదినారాయణను అరెస్ట్ చేసి హాజరు పరచగా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News February 12, 2025

నిర్లక్ష్యం వహిస్తే సహించబోను: ప్రకాశం కలెక్టర్

image

బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల తీరు, పురోగతిపై సమక్షించారు. పనితీరు పేలవంగా ఉన్న సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.

News February 12, 2025

గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి

image

జేఈఈ మెయిన్స్‌ అడ్వాన్స్‌‌డ్ పరీక్షకు అర్హత సాధించిన బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి బాలవీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులలోని గురుకుల పాఠశాలల నుంచి మొత్తం 190 మంది పరీక్షకు హాజరుకాగా 110మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. వారిని మంత్రి స్వామి అభినందించారు

error: Content is protected !!