News June 11, 2024

పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో సముద్రం ఒడ్డున మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కందుకూరుకు చెందిన కొత్తూరి వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 20, 2025

ప్రకాశం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.!

image

ప్రకాశం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కురిచేడు మండలం పడమరపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చిన్నారుల మృతికి గల కారణాలు, చిన్నారుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 20, 2025

ప్రకాశం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.!

image

ప్రకాశం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కురిచేడు మండలం పడమరపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చిన్నారుల మృతికి గల కారణాలు, చిన్నారుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 20, 2025

ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!

image

ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల,బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.

error: Content is protected !!