News July 28, 2024

పాచిపెంట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పాచిపెంట మండలం పద్మపురానికి చెందిన కంటా రమేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ నెల 23న పనులు నిమిత్తం వెళ్లిన రమేశ్ ఇంటికి రాకపోవడంతో తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈమేరకు ఒడిశా సరిహద్దు ప్రాంతం ఈతమనువలస సమీపంలో ఆదివారం మృత దేహాన్ని గుర్తించి, పోస్ట్ మార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

Similar News

News July 6, 2025

VZM: 2,232 పాఠశాలు.. 2,10,377 మంది విద్యార్థులు

image

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్క‌ర్ శనివారం తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాల నుంచి 2,10,377 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.

News July 6, 2025

ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. విజయనగరంలో 473, పార్వతీపురంలో 119, బొబ్బిలి 69, సాలూరులో 229, శృంగవరపుకోటలో 47, గజపతినగరంలో 347, చీపురుపల్లిలో 38, కొత్తవలసలో 320, కురుపాంలో 14 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

News July 5, 2025

విజయనగరం: మా భవాని ‘బంగారం’

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్‌లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.