News September 21, 2024
పాట్నాలో అనంతపురం విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ పాట్నాలో ఆత్మహత్య చేసుకున్నారు. అందిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన పల్లవీరెడ్డి పాట్నాలోని ఎన్ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో కళాశాల హాస్టల్ భవనంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 21, 2024
ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది: ఉషశ్రీ చరణ్
100 రోజుల పాలన విఫలం కావడంతోనే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూల విషయం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. కూటమి మంచి ప్రభుత్వమా? కాదా అన్నది? ప్రజలు చెప్పాలన్నారు. కానీ కూటమి నేతలే తమది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
News September 21, 2024
ఇన్స్టాలో ప్రేమ.. సోమందేపల్లిలో పెళ్లి
సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మాగేచెరువుకు చెందిన గంగాధర్కు మూడు నెలల క్రితం ఇన్స్టాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన అనూష పరిచయమైంది. తరచూ ఇన్స్టాలో మాట్లాడుకునే వారి మధ్య ప్రేమ చిగురించింది. శుక్రవారం ఆమె సోమందేపల్లికి చేరుకుని తాను ఇష్టపడిన గంగాధర్ను పెళ్లి చేసుకుంది. తొలుత వీరి పెళ్లికి ఇద్దరి తరఫున పెద్దలు అంగీకరించలేదు. గ్రామస్థులు అండగా ఉంటామని భరోసానివ్వడంతో వివాదం సద్దుమణిగింది.
News September 21, 2024
అనంత ఎస్పీ గ్రీవెన్స్కు 8 పిటిషన్లు
జిల్లా ఎస్పీ పి.జగదీశ్ జిల్లాలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బదిలీలు, సస్పెన్సన్ రీఓక్, ఇతర సమస్యలపై సిబ్బంది 8 పిటిషన్లు అందజేశారు. అర్జీలకు సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.