News February 11, 2025
పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్

బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.
Similar News
News October 14, 2025
NRPT: ‘ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించి, ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా వైద్య శాఖ కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించి, జాతీయ కార్యక్రమాల ప్రగతిని పరిశీలించారు. డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ పాల్గొన్నారు.
News October 14, 2025
పెద్దపల్లిలో డీసీసీ అధ్యక్ష అభిప్రాయ సేకరణ

PDPL డీసీసీ అధ్యక్ష నియామకంపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం మంగళవారం PDPLలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, RMG MLA MS రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ పరిశీలకులు డా. జయకుమార్, కేతురి వెంకటేష్, ఖాజా ఫక్రుద్దిన్, TPCC జనరల్ సెక్రటరీ రాజేష్ కాశీపాక హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, మహిళా, యువజన, NSUI కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.
News October 14, 2025
చిత్తూరు జిల్లాలో TDPని చుట్టుముడుతున్న వివాదాలు

చారిత్రాత్మక విజయం అనంతరం జిల్లాలో TDP బలోపేతం అవుతుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నకిలీ లిక్కర్ స్కామ్, మహిళలపై లైంగిక వేధింపులతోపాటూ వారి వ్యక్తిగత వీడియోలు తీసిపెట్టాలనే ఆరోపణలు జిల్లాలోని కూటమి MLAల మెడకు చుట్టుకుంటున్నాయి. శుభమా అని అన్ని సీట్లు గెలిచిన TDPలో ఏడాదిన్నరలోపే వివాదాలు రేగడం అధిష్ఠానం వైఫల్యమే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.