News June 12, 2024
పాఠశాలలకు చేరిన పుస్తకాలు

నేటి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు 6,84,740 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఈ మొత్తాన్ని ఇప్పటికే సంబంధిత పాఠశాలలకు సరఫరా చేశారు. 3,94,314 రాతపుస్తకాలను సైతం అందుబాటులో ఉంచారు. ఈసారి నూరు శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరటం విశేషం.
Similar News
News December 10, 2025
పాల్వంచ వ్యక్తికి ఏడాది జైలు

చెక్ బౌన్స్ కేసులో భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన భాసబోయిన వేణుకు ఖమ్మం అదనపు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వద్ద 2022లో వేణు రూ.9.90 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు దాఖలైంది. న్యాయాధికారి బిందుప్రియ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.
News December 10, 2025
26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్కు రూ.100, ఇంటర్కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్కు రూ.500, ఇంటర్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
News December 10, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.


