News February 10, 2025

పాఠశాలలపై అపోహలు వద్దు: మంత్రి స్వామి

image

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలులో బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాక ఫౌండేషన్, ప్రైమరీ, హైస్కూల్ కొనసాగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయితీకి ఒకటి మాత్రమే మోడల్ స్కూల్ ఉంటుందనే అపోహ వద్దన్నారు.

Similar News

News May 7, 2025

ఒంగోలు: మత్స్యకారులకు మెగా చెక్కును అందజేసిన కలెక్టర్

image

ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఒంగోలు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు.

News May 7, 2025

ఒంగోలు: మూగజీవుల పాలిట ప్రాణదాతలు పశు వైద్యులు

image

మూగజీవుల పాలిట ప్రాణదాతులుగా పశు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పంపిన సందేశాన్ని వినిపించారు.

News May 7, 2025

ఒంగోలు: గనుల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ గనుల శాఖ అధికారులు, 6 ఇసుక స్టాక్ యార్డుదారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ డిపోలలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాపై తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.