News December 12, 2024

పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: చిత్తూరు JC

image

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.

Similar News

News January 17, 2025

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్‌ నెల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం జ‌న‌వ‌రి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జ‌న‌వ‌రి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.

News January 17, 2025

సదుం: చిన్నారుల మృతికి కారణమైన తల్లి అరెస్ట్

image

చిన్నారులతో పాటు ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి.. వారి మృతికి కారకురాలైన తల్లిని అరెస్టు చేసినట్లు సీఐ రాంభూపాల్ మంగళవారం తెలిపారు. సదుం మండల కేంద్రానికి చెందిన కరిష్మా ఈనెల 12న తన ఇద్దరు చిన్నారులతోపాటు కరెంటు వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.

News January 17, 2025

20 నుంచి తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం 20వ తేదీ నుంచి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అదేవిధంగా ప్రోటోకాల్ మినహా 20న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.