News February 1, 2025

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టండి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాఠశాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలకు చేసే రాకపోకలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News February 2, 2025

NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.

News February 2, 2025

కొత్తగూడెం: దివ్యాంగులకు శుభవార్త.. గడువు పొడిగింపు

image

దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 12వ తేదీ వరకు పొడిగించారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జేఎం స్వర్ణలత తెలిపారు. ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతి వృత్తులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోడానికి జిల్లాలోని దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

News February 2, 2025

మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

image

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్‌ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.