News February 12, 2025

పాఠశాలల విలీనంపై మంత్రి సవిత సమీక్ష

image

పెను కొండ నియోజకవర్గ పరిధిలో పాఠశాలల విలీనంపై జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప, ఎంఈవోలతో మంత్రి సవిత ఆర్&బి అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంతవరకు ఏ పాఠశాలనూ మూసివేయకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించాలన్నారు. పాఠశాలలను విలీనం చేసే సమయంలో ఎలాంటి విమర్శలకూ తావివ్వకుండా అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.

Similar News

News November 24, 2025

ములుగు: జీపీ రిజర్వేషన్ల గెజిట్ రిలీజ్

image

మంగపేట మినహా మిగిలిన తొమ్మిది మండలాల్లోని 146 సర్పంచ్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్‌ను కలెక్టర్ దివాకర విడుదల చేశారు. మొత్తం స్థానాలు: 146
మహిళలు: 65
ఎస్టీలు: 100
ఎస్సీలకు: 10
బీసీలు: 5
అన్ రిజర్వుడు: 31
రిజర్వేషన్లలో స్పష్టత రావడంతో ఆశావాహులు పల్లె పోరుకు సన్నద్ధమవుతున్నారు.

News November 24, 2025

‘స్థానిక‘ స్థానాలన్నిట్లో పోటీకి BJP సన్నాహం!

image

TG: పార్టీని అన్ని స్థాయుల్లో బలోపేతం చేసేలా BJP సిద్ధమవుతోంది. స్థానిక ఎన్నిలను దీనికి అవకాశంగా భావిస్తోంది. పంచాయతీ, MPTC, ZPTC, GHMCల పరిధిలోని డివిజన్లు, వార్డులతో సహా అన్ని చోట్లా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు పార్టీ నాయకుడొకరు వివరించారు. ‘దీనివల్ల పార్టీకి ఓటు బ్యాంకు గతంలో కన్నా భారీగా పెరిగే అవకాశముంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకున్నా కార్యకర్తలనే నిలబెడతాం’ అని తెలిపారు.

News November 24, 2025

కడప: గల్లంతైన ఇద్దరు యువకులు మృతి

image

కడప శివారులోని వాటర్ గండి పెన్నా నదిలో ఆదివారం ముగ్గురు <<18370606>>గల్లంతైన <<>>విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు చనిపోయారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు రీల్స్ కోసం అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో ముగ్గురు నీటిలో కొట్టుకెళ్లారు. ఒకరిని అక్కడి వాళ్లు కాపాడారు. కె.నరేష్(18), పి.రోహిత్ కుమార్(16) సుడిగుండాల్లో చిక్కుకుని గల్లంతు అయ్యారు. ఇవాళ ఉదయం ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు.