News February 12, 2025

పాఠశాలల విలీనంపై మంత్రి సవిత సమీక్ష

image

పెను కొండ నియోజకవర్గ పరిధిలో పాఠశాలల విలీనంపై జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప, ఎంఈవోలతో మంత్రి సవిత ఆర్&బి అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంతవరకు ఏ పాఠశాలనూ మూసివేయకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించాలన్నారు. పాఠశాలలను విలీనం చేసే సమయంలో ఎలాంటి విమర్శలకూ తావివ్వకుండా అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.

Similar News

News November 23, 2025

సంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

image

సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని ఓ ఆసుపత్రిలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందారు. నర్సాపూర్‌కు చెందిన సంతోష్ (46) ఓ ఆసుపత్రిలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈనెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

News November 23, 2025

మెడికల్ షాపుల్లో PvPI టోల్ ఫ్రీ నంబర్, QR కోడ్ తప్పనిసరి

image

TG: మెడికల్ షాపుల్లో ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా(PvPI) టోల్ ఫ్రీ నంబర్, QR కోడ్ తప్పనిసరిగా ప్రదర్శించాలని వాటి యజమానులను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మందులు వికటించినా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ప్రజలు వీటి ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రోగుల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
PvPI నంబర్: 18001803024

News November 23, 2025

HYD: బస్సెందుకు మామా.. బండిపై పోదాం!

image

సిటీ బస్ ఎందుకు మామా.. బైక్ ఉంది కదా దానిపై పోదాం అని అంటున్నారు పురుషులు. నగరంలో బస్ ఎక్కే పురుషుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు ఈ గణాంకాలే సాక్ష్యం. సిటీలో రోజూ 2,850 బస్సుల్లో 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 18.5 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండగా పురుషులు కేవలం 7.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలు చాలు పురుషులు బస్‌లో వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుసుకోవడానికి.