News March 23, 2024

పాడేరుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

2019 ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీకి సంబంధించి తక్కువగా (62 శాతం) పోలింగ్ నమోదు కావడంతో ఈ దఫా పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. అల్లూరి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అన్ని ప్రధాన జంక్షన్లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

News December 7, 2025

విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.

News December 7, 2025

పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్‌ విజయవంతం

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.