News April 9, 2025

పాడేరులో 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి: డీఈవో

image

పాడేరులో ఏర్పాటు చేసిన స్పాట్ సెంటర్లో ఇప్పటి వరకు 92,116 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 11,016 పేపర్స్ మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్స్‌ను ఈ కేంద్రంలో వాల్యుయేషన్ చేస్తున్నామని తెలిపారు.

Similar News

News October 16, 2025

గ్రీన్ క్రాకర్స్ సురక్షితమేనా?

image

పొల్యూషన్ తగ్గించేందుకు వాడే <<18010671>>గ్రీన్ క్రాకర్స్‌<<>> కూడా పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే పొగ, శబ్దం తక్కువ చేసినప్పటికీ వీటి నుంచి వెలువడే అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఊపిరితిత్తులు, రక్తంలోకి చేరే ప్రమాదముందని చెబుతున్నారు. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

News October 16, 2025

చిత్తూరు జిల్లాలో సోషల్ ఆడిట్ పూర్తి

image

చిత్తూరు జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సోషల్ ఆడిట్ పూర్తయింది. 58 పాఠశాలలు తనిఖీ చేసి ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. కన్నన్ కళాశాలలో జరిగిన హెచ్ఎంల సమావేశంలో ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. ఆడిట్ రిపోర్టును 11 మంది రిసోర్స్ పర్సన్స్ పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం, పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. సమగ్ర శిక్ష ఏవో నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.

News October 16, 2025

రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

image

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.