News April 9, 2025
పాడేరులో 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి: డీఈవో

పాడేరులో ఏర్పాటు చేసిన స్పాట్ సెంటర్లో ఇప్పటి వరకు 92,116 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 11,016 పేపర్స్ మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్స్ను ఈ కేంద్రంలో వాల్యుయేషన్ చేస్తున్నామని తెలిపారు.
Similar News
News November 25, 2025
కడప కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

కడప కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్ది కాదని సృష్టం చేశారు. కలెక్టర్ ఫొటోలు వాడి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 25, 2025
BHPL జిల్లాలో మొదటి దశలో 82 పంచాయితీలకు ఎన్నికలు

భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాల్లో మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటన విడుదల చేశారు. ఘనపూర్ మండలంలో 17 పంచాయతీలు, 158 వార్డులు, కొత్తపెళ్లి గోరి మండలంలో 16 పంచాయతీలు, 128 వార్డులు, రేగొండ మండలంలో 23 పంచాయితీలు, 214 వార్డులు, మొగుళ్లపళ్లి మండలంలో 26 గ్రామ పంచాయతీలు, 212 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
News November 25, 2025
BHPL జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు

భూపాలపల్లి జిల్లాలో 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2102 వార్డులు 2102 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మొదటి విడుతలో 82 జీపీలు, 712 వార్డులు, 712 పోలింగ్ స్టేషన్లు, రెండవ విడుతలో 85 జీపీలు, 694 వార్డులు, 694 పీఎస్లు, మూడో విడుతలో 81 జీపీలు, 696 వార్డులు, 696 పీఎస్లకు ఎన్నికలు జరగనున్నాయి.


