News March 16, 2025

పాడేరు: ‘అన్ని పోలీసు కార్యాలయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్’

image

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు శనివారం తెలిపారు. అన్ని మండలాల్లో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గ్రీవెన్స్ నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 17వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News November 23, 2025

మావోయిస్టు కీలక నేతల్లో సిక్కోలు వాసులు

image

మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ కీలక నేతల్లో సిక్కోలు వాసులు ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావు మృతిచెందగా, తాజాగా మరేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో జిల్లాలోని బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు కీలకనేత మెట్టూరు జోగారావు(టెక్ శంకర్) మరణించారు. అదే ప్రాంతానికి చెందిన చెల్లూరు నారాయణరావు(సూరన్న) అజ్ఞాతంలో ఉన్నారు.

News November 23, 2025

ఆన్‌లైన్‌లో సర్వపిండి, సకినాలు!

image

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

News November 23, 2025

పెద్దపల్లి కలెక్టరేట్‌లో సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువజన-క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం భగవాన్ శ్రీసత్య సాయి బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి బాబా చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు పూలమాల వేసి సేవా స్ఫూర్తిని స్మరించారు. ఈ కార్యక్రమంలో యువజన-క్రీడాశాఖ అధికారి సురేష్, సేవా ట్రస్ట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, దాసరి రమేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.