News March 16, 2025

పాడేరు: ‘అన్ని పోలీసు కార్యాలయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్’

image

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు శనివారం తెలిపారు. అన్ని మండలాల్లో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గ్రీవెన్స్ నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 17వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News November 10, 2025

గద్వాలలో 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

image

గద్వాల జిల్లాలో మొత్తం 81 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 76 ప్రారంభించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం చెప్పారు.

News November 10, 2025

MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 10, 2025

ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

image

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.