News April 6, 2024

పాడేరు: ఎన్నికల ఫిర్యాదులకు అదనంగా మరో 3 నంబర్లు

image

రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులకు ప్రస్తుతం ఉన్న 1950 టోల్ ఫ్రీ నంబరుతో పాటు మరో మూడు ల్యాండ్ లైన్ నంబర్లను అదనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ఎన్నికల నిభందనలు ఉల్లంఘన, బహుమతులు, నగదు పంపిణీ, అక్రమ తరలింపు, మత్తు పదార్ధాల పంపిణీ, తరలింపు, తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రజలు 08935-299934, 08935-299912, 08935 -293448 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Similar News

News December 25, 2025

స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

image

జీవీఎంసీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిందని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తెలిపారు. జీవీఎంసీ హాల్లో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు తొలగింపు చేయడం జరిగిందని, విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1425 కోట్లతో 250 దుకాణాలను మొదటి ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి జోన్లో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్ని జరుగుతాయని తెలిపారు.

News December 25, 2025

విశాఖలో పబ్ నిర్వాహకులకు సీపీ వార్నింగ్

image

విశాఖపట్నం నగరంలోని బార్, పబ్ నిర్వాహకులతో పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ధ్వని కాలుష్యం, అక్రమ పార్కింగ్, డ్రగ్స్ వాడకం, మైనర్లకు మద్యం సరఫరాపై సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయపాలన పాటించాలని, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు.

News December 25, 2025

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు: సీపీ

image

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ.. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.