News April 13, 2025
పాడేరు: ఏప్రిల్ 17న డిఎన్ఎఫ్ సమావేశం

2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా లాభాపేక్ష లేని పోరం( డిఎన్ఎఫ్) మొదటి సమావేశం ఈనెల 17వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 29న జరిగిన ఈ సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
Similar News
News October 14, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 120 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 120 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News October 14, 2025
కురుపాం గురుకులాన్ని సందర్శించిన ప్రత్యేక బృందం

కురుపాం గురుకులాన్ని సోమవారం రాత్రి ప్రత్యేక బృందం సందర్శించింది. వైద్య, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కూడిన 8 మంది సభ్యులు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పాఠశాలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేశారు. పాఠశాల ప్రారంభానికి కావలసిన వసతులను పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు.
News October 14, 2025
బాణసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి: SP నరసింహ

దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా (పటాకులు) విక్రయానికి సంబంధించిన దుకాణాలు పెట్టేందుకు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ నరసింహా తెలిపారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే క్రాకర్స్ విక్రయం జరపాలన్నారు. బాణసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.