News April 13, 2025
పాడేరు: ఏప్రిల్ 17న డిఎన్ఎఫ్ సమావేశం

2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా లాభాపేక్ష లేని పోరం( డిఎన్ఎఫ్) మొదటి సమావేశం ఈనెల 17వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 29న జరిగిన ఈ సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
Similar News
News November 15, 2025
వరంగల్: ట్రాఫిక్ తనిఖీలతో ప్రజలకు ఇబ్బందులు..?

WGL ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తూ తనిఖీలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసర ప్రయాణాలు కూడా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NSPT ప్రధాన రహదారిపై రామ్ కీ ఎదురుగా ఆకస్మికంగా వాహనాలు ఆపేయడం వల్ల డ్రైవర్లు ఒక్కసారిగా అయోమయానికి గురై, సమస్య ఉన్న ప్రాంతాల్లో కాకుండా అవసరం లేని చోట్ల నియంత్రణ చేయడంపై విమర్శలు చేస్తున్నారు.
News November 15, 2025
సతీశ్ మృతి.. హత్యగా నిర్ధారిస్తూ కేసు నమోదు.!

TTD మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ <<18292217>>మృతి<<>>ని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జీఆర్పీ పీఎస్లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నం.75/2025గా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్ TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈనెల 6న CID విచారణకు వెళ్లిన ఆయన.. నిన్న మరోసారి విచారణకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
News November 15, 2025
ఖమ్మం: కానిస్టేబుల్ సూసైడ్

ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (38) శుక్రవారం ఎదులాపురం సింహద్రినగర్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఆయన సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. గాయాల కారణంగా మనస్తాపం చెంది బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూరల్ సీఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


