News January 26, 2025

పాడేరు: ‘గెడల్లో తవ్వకాలకు అనుమతులు లేవు’

image

ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులతో సమీక్షించి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని గెడ్డలు, వాగుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నియంత్రిస్తామన్నారు. అభివృద్ధి పనులు, గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే ఇసుక సేకరించవచ్చన్నారు. ప్రధాన గెడ్డల్లో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Similar News

News November 27, 2025

రూ.89కే X ప్రీమియం ఆఫర్

image

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని X.. ప్రీమియం సేవలను కేవలం రూ.89కే అందిస్తూ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. Grok AI, బ్లూ టిక్‌ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డిసెంబర్‌ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్‌ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.

News November 27, 2025

NZB: మొదటి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే?

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 11 మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికల్లో 2,61,210 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. ఇందులో మహిళలు 1,37, 413 మంది, పురుషులు 1,23,790 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఇందు కోసం 1,653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.

News November 27, 2025

రబ్బరు పాలను ఎలా సేకరిస్తారు?

image

హెక్టారు రబ్బరు తోట నుంచి ఏడాదికి దాదాపు 2000కి.గ్రా. దిగుబడి వస్తుంది. మొక్క నుంచి వచ్చే పాల కోసం చెట్టుపై బెరడును కొంత తొలగిస్తారు. కాండం నుంచి కారే రబ్బరు పాలను సేకరించడం కోసం డబ్బా లేదా కుండను పెడతారు. ఈ విధానాన్ని టాపింగ్ అంటారు. అయితే మొక్కకు గాటు పెట్టిన దాదాపు 4గంటల పాటు ఈ రబ్బరు పాల రూపంలో కారుతుంది. గడ్డకట్టే రబ్బరు పాలను ఫ్యాక్టరీకి పంపిస్తారు. మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది.