News January 26, 2025
పాడేరు: ‘గెడల్లో తవ్వకాలకు అనుమతులు లేవు’

ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులతో సమీక్షించి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని గెడ్డలు, వాగుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నియంత్రిస్తామన్నారు. అభివృద్ధి పనులు, గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే ఇసుక సేకరించవచ్చన్నారు. ప్రధాన గెడ్డల్లో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
Similar News
News October 28, 2025
VJA: ‘వరి, పత్తి పొలాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడండి’

వరి, పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి రైతులకు సూచించారు. పొలాల్లోని నీరు బయటకు వెళ్లేలా పంట బోదేలు, డ్రైనేజీలను సిద్ధం చేసుకోవాలన్నారు. తుపాను వెళ్లే వరకు వరి కోత పనులను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షానికి అధైర్య పడకుండా అప్రమత్తంగా ఉండాలని రైతులను ఆమె కోరారు.
News October 28, 2025
వనపర్తి: వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. రైతులు వరి కోతలు చేపట్టవద్దన్నారు. వర్షం పడేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని, శిథిలావస్థ భవనాలలో నివాసం ఉండరాదని సూచించారు. ఉరుములు, మెరుపులకు పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలన్నారు.
News October 28, 2025
NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.


