News March 11, 2025
పాడేరు: ‘గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరి’

గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సబ్ కల్లెక్టర్స్, 22 మండలాల ఎమ్మార్వోలు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లతో మంగళవారం రెవిన్యూ అధికారుల వారాంతపు సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్లో వచ్చిన నివేదికలో గ్రామ రెవిన్యూ అధికారి క్షేత్ర సందర్శనలు చేయటం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్వోలు బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.
News December 7, 2025
కొత్తగూడెం: మత్తులో ట్రాక్ దాటుతూ రైలు కిందపడి..

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 7, 2025
విజయవాడ: ‘నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ కీలకం’

నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేశ్ను గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు రూ. 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లడానికి కూడా జోగి రమేశే కారణమని వెల్లడించింది.


