News March 11, 2025
పాడేరు: ‘గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరి’

గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సబ్ కల్లెక్టర్స్, 22 మండలాల ఎమ్మార్వోలు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లతో మంగళవారం రెవిన్యూ అధికారుల వారాంతపు సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్లో వచ్చిన నివేదికలో గ్రామ రెవిన్యూ అధికారి క్షేత్ర సందర్శనలు చేయటం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్వోలు బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 22, 2025
లోక్ అదాలత్లో 3,884 కేసుల పరిష్కారం: సూర్యాపేట ఎస్పీ

జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 3,884 కేసులు పరిష్కారమైనట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఇందులో 446 క్రిమినల్, 1,582 ఈ-పెట్టీ, 1,856 ఎంవీ యాక్ట్ కేసులు ఉన్నాయి. అలాగే 33 సైబర్ కేసుల్లో రూ.11.50 లక్షలను బాధితులకు రీఫండ్ చేయించారు. పోలీస్, న్యాయశాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని, ముందస్తు ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 22, 2025
ఫిర్యాదులపై సత్వర చర్యలు: సూర్యాపేట ఎస్పీ

బాధితులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో వేగంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
News December 22, 2025
TETపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్

AP: టీచర్లందరికీ TET తప్పనిసరి చేస్తూ ఇటీవల SC ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 2011లో ఈ విధానం వచ్చింది. అయితే SC తీర్పుతో అంతకు ముందు నియమితులైన వారికీ టెట్ తప్పనిసరైంది. వీరు 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలి. ఎన్నో ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తాము ఇపుడు టెట్ పాసవ్వాలనడంపై లక్షలాది టీచర్లు ఆందోళనతో ఉన్నారు. దీనిపై వారి వినతితో మినహాయింపు కోసం ఈ పిటిషన్ వేశామని ఓ అధికారి తెలిపారు.


