News January 20, 2025
పాడేరు ఘాట్లో తప్పిన పెను ప్రమాదం

పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాడేరు నుంచి విశాఖకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏసుప్రభు విగ్రహం మలుపు వద్ద రైలింగ్ ఢీ కొట్టి నిలిచిపోయింది. రైలింగ్ లేకపోతే పెద్ద లోయలో బస్సు పడేదని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కొంతసేపు బస్సు నిలిచింది. మలుపులో స్టీరింగ్ పట్టేయడంతో నేరుగా రైలింగ్ను ఢీకొట్టింది.
Similar News
News February 8, 2025
కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్పూర్లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 8, 2025
జాతీయస్థాయి అథ్లెటిక్స్లో విశాఖ క్రీడాకారులకు పతకాలు

రాజస్థాన్లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.
News February 7, 2025
ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి: కలెక్టర్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో అధికారులతో సమావేశమయ్యారు. నామినేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పన, జాబితాల తయారీ, సిబ్బంది కేటాయింపు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు.