News March 8, 2025
పాడేరు: జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు

అల్లూరి జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు పెంచేందుకు కృషి చేస్తున్నామని కాఫీ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ అప్పలనాయుడు పాడేరులో శనివారం తెలిపారు. ITDA. ఆధ్వర్యంలోని చింతపల్లి ఏరియాలోని నర్సరీలో మొక్కలు పెంచుతున్నామని, వీటిని వచ్చే వర్షకాలంలో నాటేందుకు రైతులకు ఉచితంగా అందజేస్తామ్మన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 2.5లక్షల ఎకరాల్లో ఈ పంట పండుతుందని అన్నారు.
Similar News
News November 20, 2025
వేములవాడ: భీమేశ్వరాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన MLA

వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆలయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలు, 12 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను అధికారులు MLA చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.
News November 20, 2025
MNCL: జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి ఛైర్మన్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ, ఉత్పత్తి చేయడం కోసం నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరామ్ సభ్యులుగా నియమితులయ్యారు. దేశ కీలక ఖనిజ ప్రణాళికల వేగవంతం, స్వదేశీ వనరుల అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో సింగరేణి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నియామకం సంస్థ ప్రతిష్టను మరింత పెంచనుంది.
News November 20, 2025
బండి సంజయ్పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.


