News March 24, 2025

పాడేరు: టెన్త్ పరీక్షలకు 11,564 విద్యార్థులు

image

అల్లూరి జిల్లాలో 71పరీక్ష కేంద్రాల్లో సోమవారం పదో తరగతి లెక్కలు పరీక్ష 11,564 మంది విద్యార్థులు రాయనున్నారని DEO బ్రాహ్మజిరావు పాడేరులో తెలిపారు. జిల్లాలో 258 ఆశ్రమ, జడ్పీ, KGBV, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారని అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

కేంద్ర బలగాలతో ఉప ఎన్నిక నిర్వహించాలి: BRS

image

ECI అధికారులతో BRS MPలు సురేశ్ రెడ్డి, దామోదర్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. CM, మంత్రులు అధికార దుర్వినియోగానికి, కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాలన్నారు. స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మహిళా అధికారులను నియమించాలన్నారు.

News November 7, 2025

వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

image

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.

News November 7, 2025

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు

image

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్‌తో 27మంది, బోన్/లివర్ క్యాన్సర్‌తో 5మంది, బ్లడ్ క్యాన్సర్‌తో 9మంది, బ్రెస్ట్ క్యాన్సర్‌తో 70మంది, ఓరల్ క్యాన్సర్‌తో 33మంది, గొంతు క్యాన్సర్‌తో 18మంది, ఇతర క్యాన్సర్ లక్షణాలతో 83మంది బాధపడుతున్నారు. ‘ఈరోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవం’.