News March 24, 2025
పాడేరు: టెన్త్ పరీక్షలకు 11,564 విద్యార్థులు

అల్లూరి జిల్లాలో 71పరీక్ష కేంద్రాల్లో సోమవారం పదో తరగతి లెక్కలు పరీక్ష 11,564 మంది విద్యార్థులు రాయనున్నారని DEO బ్రాహ్మజిరావు పాడేరులో తెలిపారు. జిల్లాలో 258 ఆశ్రమ, జడ్పీ, KGBV, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారని అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
బంగ్లా అదుపులో మత్స్యకారులు.. వెనక్కి తీసుకొస్తామన్న మంత్రి

AP: బంగ్లాదేశ్ నేవీ <<18075524>>అదుపులో<<>> ఉన్న 8 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
News October 23, 2025
HYD: తెలుగు వర్సిటీ VCగా నిత్యానందరావు ఏడాది పూర్తి

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు తన పదవి కాలంలో ఏడాది పూర్తి అయింది. దీంతో వర్సిటీ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం బాచుపల్లి ఆడిటోరియంలో సన్మానించారు. రిజిస్ట్రార్ ఆచార్య హనుమంతరావు మాట్లాడుతూ.. ఆధునిక కళామందిరం,క్రీడా ప్రాంగణం, విద్యార్థులకు, ఉద్యోగులకు సదుపాయాలను కల్పిస్తూ వర్సిటీలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం హర్షదాయకమన్నారు. వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
News October 23, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నిన్నమొన్నటి వరకూ కురిసిన వర్షాలు ట్రైలర్ మాత్రమేనని నేటి నుంచి TGలో అసలు వర్షాల జోరు మొదలవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాలోనూ చిరుజల్లులు పడొచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.