News April 12, 2025

పాడేరు: త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్‌ను కలెక్టర్ దినేశ్ కుమార్ పాడేరు ఐటీడీఏలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీన అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా జరుగుతుందని, మే 2వ తేదీన పాడేరులో, అదేవిధంగా జూన్ 6వ తేదీన రంపచోడవరంలో ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 4, 2026

ఖమ్మం: సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్లు

image

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఖమ్మం నగరానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

News January 4, 2026

‘భోగా’పురం మంటలు

image

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు <<18758900>>వైభోగానికి<<>> తామే కారణమంటూ టీడీపీ, వైసీపీ ప్రకటనలు చేస్తున్నాయి. తమ పాలనలో వేగంగా అనుమతులు తీసుకురావడం వల్లే ఈ మైలురాయి చేరుకున్నామని జగన్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టును అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్‌దేనని, ఇలా చెప్పుకోవడానికి వైసీపీకి సిగ్గుండాలని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. మోదీ-CBN వల్లే నిర్మాణం పూర్తయిందని కౌంటర్ ఇచ్చారు.

News January 4, 2026

ఈనెల 9 నుంచి అంతర్ రాష్ట్ర సంక్రాంతి క్రికెట్ కప్

image

రావినూతలలో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు ఈనెల 9న ప్రారంభం కానున్నట్లు RSCA అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల నుంచి 16 జట్లు తలపడనున్నాయన్నారు. విజేతలకు వరుసగా రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.1 లక్ష నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ క్రీడలకు గిరిబాబు హాజరవుతారని సమావేశంలో పాల్గొన్న సినీ నటుడు రఘుబాబు వెల్లడించారు.