News February 6, 2025

పాడేరు: పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్రణాళికలు

image

పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అరకు చలి ఉత్సవంలో పాల్గొన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేసి, సంబంధిత గ్రామాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, అటవీశాఖ, గిరిజన చట్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Similar News

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

KMR: జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచుల ఏకగ్రీవం

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగియగా..10 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఏకగ్రీవమైనట్లు DPO మురళి గురువారం వెల్లడించారు. మిగిలిన స్థానాల్లో పోటీ అనివార్యమవడంతో, ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు.

News December 5, 2025

మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.