News April 11, 2025
పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.
Similar News
News October 27, 2025
తుఫానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. అతి భారీ వర్షాలు

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 640kms, విశాఖకి 740kms, కాకినాడకి 710kms దూరంలో కేంద్రీకృతం అయిందని పేర్కొంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రాత్రికి తీరం దాటొచ్చని అంచనా వేసింది. నేడు కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
News October 27, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
News October 27, 2025
నారద భక్తి సూత్రాలు – 9

తస్మిన్ అనన్యతా తద్విరోథిషూదాసీనతా చ
భక్తులకు సకల కార్యాలు దైవసేవనే అవుతాయి. మిగితా వాటిని వారు ఉపేక్షిస్తారు. భక్తుల ఇచ్ఛ భగవదిచ్ఛగా మారుతుంది. భక్తుల చిత్తం ఈశ్వరాయత్తమై, దైవీ ప్రేరణతో నడుస్తుంది. భగవంతుడు భక్తులలో ప్రవేశించగానే వారి బుద్ధి దేవునితో అనుసంధానమై, నిరంతరం భగవత్ కళ్యాణ గుణాలను అనుసరిస్తుంది. చిత్తం భగవద్దత్తం కావడం వల్ల ఇంద్రియాలకు భక్తి సోకుతుంది. ప్రపంచంతో బంధం ఉండదు. <<-se>>#NBS<<>>


