News April 11, 2025

పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

image

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం

image

సిద్దిపేట జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మం. బీజీ వెంకటాపూర్‌లో పరమేశ్వర్, మాందాపూర్‌లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్‌లో కుమార్‌ను గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

News November 28, 2025

మచిలీపట్నం: మళ్లీ సేమ్ సీన్ రిపీట్..?

image

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి రవీంద్ర కలిసి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. ఒకట్రెండు సార్లు ప్రెస్‌మీట్‌లలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలోనూ మాజీ మంత్రి పేర్నినాని, ఎంపీ బాలశౌరికి అంతర్గత విభేదాలతో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.

News November 28, 2025

సర్పంచ్ నుంచి MLAగా.. రాణించిన జిల్లా నేతలు..!

image

గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన పలువురు నేతలు MLAలుగా రాణించారు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్‌గా పేరు తెచ్చుకున్న రేగులపాటి పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా, గంభీరావుపేట వార్డు సభ్యుడిగా పనిచేసిన కటకం మృత్యుంజయం కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగిత్యాల జిల్లా అంతర్గాం సర్పంచ్‌గా పనిచేసిన సుద్దాల దేవయ్య నేరెళ్ల ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మంత్రిగా సేవలందించారు.