News April 11, 2025
పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.
Similar News
News December 2, 2025
రూపాయి నేల చూపు.. మరింత కనిష్ఠ స్థాయికి!

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
News December 2, 2025
NRPT జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

NRPT జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కుల సంఘాలు పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News December 2, 2025
NRPT జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

NRPT జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కుల సంఘాలు పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


