News April 11, 2025

పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

image

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.

Similar News

News July 8, 2025

ఉమ్మడి NZB జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అజ్మత్ హుస్సేన్

image

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉండగా అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సన్నదమవుతుంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను సోమవారం నియమించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత అజ్మత్ ఉల్లా హుస్సేన్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్‌గా ఉన్నారు.

News July 8, 2025

JGTL: వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు

image

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ సోమవారం విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఆయన అభినందించారు.

News July 8, 2025

లండన్‌లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్‌లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్‌లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్‌లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.