News March 14, 2025

పాడేరు: ‘ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి’

image

హోలీ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. గురువారం ఆయన పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా శాంతికి భంగం కలగకుండా, ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 1, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం పర్యటన.. ఎప్పుడంటే?

image

భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు సీఎంవో కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8:20 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 10:20 గం.కు భామినిలోని హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడనుండి 10:30కు ఏపీ మోడల్ పాఠశాలకు రోడ్డు మార్గంలో చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుగుపయనమవుతారు.

News December 1, 2025

సిద్దిపేట: ఎన్నికలపై అధికారులతో కలెక్టర్ సమావేశం

image

గ్రామపంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో ఎంపీడీఓ, ఎంపీఓ, అర్ఓ, ఏఅర్ఓ ఇతర అధికారులతో కలెక్టర్ హైమావతి సోమవారం జూమ్ సమావేశం నిర్వహించి అధికారులకు ఎలక్షన్ ప్రక్రియ గురించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడత స్క్రూటిని ప్రక్రియ గురించి ఆరా తీశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకర్గదర్హకాలకు అనుగుణంగా స్క్రూటిని చేయాలన్నారు.

News December 1, 2025

ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

image

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>