News January 25, 2025
పాడేరు: బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా తీసుకున్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును కలెక్టర్ తీసుకున్నారు. గత ఏడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్ లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్కు ఈ అవార్డును అందుకున్నారు.
Similar News
News February 18, 2025
నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 18, 2025
రేపు ఢిల్లీ సీఎం ఎంపిక, ఎల్లుండి ప్రమాణం

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో బీజేపీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20న సా.4.30 గం.కు కాకుండా ఉ.11.30 గం.కు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. రేపు మ.3.30 గం.కు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై సీఎం పేరును ఖరారు చేయనుంది. రేసులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.
News February 18, 2025
HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ -2025 కాన్క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.