News March 6, 2025
పాడేరు: ‘మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి’

ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అల్లూరి జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ కలెక్టరేట్లో అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం పరిధిలో ప్రతి ITDAలో, అదేవిధంగా మండల స్థాయిలో కూడా నిర్వహించాలని సూచించారు. పాడేరులో కనీసం మూడు వేల మందితో సమావేశం ఏర్పాటు చేయాలని, వివిధ రంగాలలో నిష్ణాతులను, ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి వారిని సత్కరించాలని సూచించారు.
Similar News
News November 21, 2025
వరంగల్: విద్యార్థుల వికాసానికి ‘చెలిమి’

ఉద్యోగుల భావోద్వేగ స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం చెలిమి సోషియో-ఎమోషనల్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 92 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన నోడల్ టీచర్లు హైదరాబాద్లో మూడు విడతలుగా శిక్షణ పొందుతున్నారు. అనంతరం 6వ తరగతి పై విద్యార్థులకు చెలిమి కరికులం అమలు చేయనున్నారు. భావోద్వేగాలు, స్వీయ నియంత్రణ, పాజిటివ్ ఆలోచన ప్రధాన లక్ష్యం.
News November 21, 2025
HYD: దొంగ నల్లా కనెక్షన్పై ఫిర్యాదు చేయండి

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
News November 21, 2025
ఖమ్మం: అనుమానంతో భార్యను కడతేర్చిన వైనం

ఖమ్మం గట్టయ్య సెంటర్లో తన భార్య సాయి వాణి(33)ని భర్త గోగుల భాస్కర్ కత్తితో గొంతు కోసి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్లుగా అనుమానంతో వేధిస్తున్న భాస్కర్కు గతంలో పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఏడాదిగా విడిగా ఉంటున్న భార్యను మాటువేసి హతమార్చాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిది APలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.


