News April 12, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 110 ఫిర్యాదులు

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 110 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేశ్ కుమార్తో కలిసి జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో కే.పద్మలత వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 6, 2025
కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్?

కొత్త జిల్లాలు, డివిజన్ల మార్పుచేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. బనగానపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే అంశంపై ఉపసంఘం చర్చించింది. మంత్రి BC జనార్దన్రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ అంశాన్ని పరిశీలించింది. మరోవైపు కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటుపైనా ఉపసంఘం దృష్టి సారించింది. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.
News November 6, 2025
10వ తేదీ జోగులాంబ ఆలయంలో కార్తీక సంబరాలు

ఈనెల 10వ తేదీ అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పరంపర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరపత్రికను విడుదల చేసింది. ఆలయాల వైభవం ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు ఉట్టిపడేటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంబరాలు చోటుచేసుకొనున్నాయి.
News November 6, 2025
పెద్దపల్లి: ఆరోగ్యం కుదుటపడట్లేదని మహిళ సూసైడ్

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన గుండ లలిత(45) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆమె గత మూడేళ్లుగా షుగర్, లివర్, ఇతర వ్యాధులతో బాధపడుతోంది. వీటికి చికిత్స పొందుతున్నా ఎంతకీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి మృతి చెందింది. భర్త గుండ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


