News April 4, 2025

పాడేరు: ‘రూ.456 కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు’

image

అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు.

Similar News

News November 18, 2025

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.

News November 18, 2025

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.

News November 18, 2025

వి‘పత్తి’.. తగ్గిన దిగుబడి, పెరగని రేటు!

image

APలో ఇటీవల తుఫానుతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతోపాటు నాణ్యతా లోపించింది. దీంతో మద్దతు ధర అందడం లేదు. MSP ₹7,710-8,110 ఉండగా, ₹7వేల లోపే ధర పలుకుతోంది. CCI కేంద్రాల్లో తేమ పరీక్షతో ధర తగ్గించడం, శ్లాబుల వల్ల ఎదురుచూడలేక ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముతున్నారు. పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని వాపోతున్నారు. అటు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.