News April 11, 2025

పాడేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

పాడేరు మండలం మినుములూరు రహదారి మార్గంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై పాడేరు వెళ్తున్న చిరు వ్యాపారిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలబడేవని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News December 2, 2025

మహబూబ్‌నగర్: జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ల నుంచి జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

News December 2, 2025

300 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఓరియెంటల్ <<>>ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ/PG, PG(ఇంగ్లిష్, హిందీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 10న ప్రిలిమ్స్, FEB 28న మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. బేసిక్ పే రూ.50,925 చెల్లిస్తారు.

News December 2, 2025

590 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌: సూర్యాపేట ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఎస్పీ నరసింహ ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌ చేసి, 291 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.