News April 11, 2025
పాడేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

పాడేరు మండలం మినుములూరు రహదారి మార్గంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై పాడేరు వెళ్తున్న చిరు వ్యాపారిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలబడేవని పోలీసులు చెబుతున్నారు.
Similar News
News April 13, 2026
నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News April 13, 2026
NGKL: జిల్లాలో పెరుగుతున్న ఎండలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సిర్సనగండ్ల, పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, జటప్రోలు, లింగాల తదితర ప్రాంతాల్లోనూ పార 41 డిగ్రీలు దాటింది. భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు.
News April 13, 2026
CMR జడ్జి కోర్టులో ఘనంగా పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం

పద్మం సిల్వర్ జువెలరీ వారి మరొక శాఖను జడ్జి కోర్టు ఎదురుగా గల CMR షాపింగ్ మాల్లో CMR గ్రూపు సంస్థల డైరెక్టర్ మావూరి బాలాజీ, సతీమణి హారికతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా,రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.25 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామన్నామని బాలాజీ తెలిపారు.


