News February 5, 2025
పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు

లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News October 29, 2025
NGKL: భారీ వర్షాలు… జూనియర్ కళాశాలలకు నేడు సెలవు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, జిల్లా కేంద్రంలో రెడ్ అలర్ట్ ఉన్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఐఈవో వెంకటరమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ సెలవుకు బదులుగా రాబోయే రెండవ శనివారం రోజున కళాశాలలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: ఫ్యామిలీ గ్రూపులో మెసేజ్ పెట్టి భర్త అదృశ్యం

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్(24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహమైంది. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన భర్త తిరిగి రాలేదు. ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్లో తన చావుకు కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News October 29, 2025
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పొంగులేటి

భారీ వర్షాల నేపథ్యలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీంతో బుధవారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.


