News February 5, 2025
పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు

లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News February 18, 2026
5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
News February 18, 2026
25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<
News February 18, 2026
భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.


