News January 24, 2025
పాడేరు: ‘లొంగిపోయిన మావోల సమస్యల పరిష్కారానికి కృషి’

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు, మిలీషియా సభ్యులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఎస్పీ అమిత్ బర్దార్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ కే.ధీరజ్తో కలిసి సరళ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టు, మిలీషియా సభ్యుల పిల్లలతో సమావేశం నిర్వహించారు. వారి చదువు, ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కల్పించారు. బాగా చదువుకోవాలన్నారు.
Similar News
News February 16, 2025
రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు

AP: తిరుపతిలో రేపు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. ఎక్స్పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్షాపులు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
News February 16, 2025
G-PAY వాడే వారికి శుభవార్త

గూగుల్ పేలో త్వరలోనే AI ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్లతోనే UPI లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం సంస్థ దీనిపై ప్రయోగాలు చేస్తుండగా, త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా చదువులేని వారు కూడా సులభంగా లావాదేవీలు చేయవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అన్ని భారతీయ భాషలను ఇందులో ఇంక్లూడ్ చేసేలా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.
News February 16, 2025
GBSపై ఆందోళన వద్దు: GGH సూపరింటెండెంట్

AP: GBSతో మహిళ <<15482663>>మృతి చెందడంపై<<>> గుంటూరు GGH సూపరింటెండెంట్ స్పందించారు. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడిపోయిన స్థితిలో ఆమె ఆస్పత్రిలో చేరారన్నారు. ఇప్పటికే కమలమ్మకు 2సార్లు కార్డియాక్ సమస్య వచ్చిందని, మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో చనిపోయారని చెప్పారు. మరో GBS బాధితురాలు ICUలో ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధిపై ఆందోళన వద్దని, సోకిన వారిలో మరణాలు 5% లోపేనని వివరించారు.