News February 20, 2025

పాడేరు: సరళ కార్యక్రమంలో 80 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

image

సరళ కార్యక్రమంతో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పెదబయలు, ముంచంగిపుట్టు, మంప, సీలేరు తదితర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన 80 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఇందులో 60 మంది ఎంపికయ్యారు. వీరికి సీఈఎంఎస్ సంస్థ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు. 

Similar News

News November 20, 2025

MHBD: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: DEO

image

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని DEO దక్షిణామూర్తి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను MHBDలోని గ్రంథాలయంలో నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ప్రజలలో సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక చైతన్యాన్ని తీసుకురావడంలో గ్రంథాలయాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కార్యదర్శి తూర్పాటి శ్రీలత ఉన్నారు.

News November 20, 2025

ములుగు: ‘స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలి’

image

గ్రామీణ ప్రాంత మహిళలు, యువకులు స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగులోని సంక్షేమ భవన్‌లో పీఎం-ఈజీపీ పథకాలపై ఆహ్వాన కార్యక్రమం జరిగింది. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి, వ్యాపారాలు చేయడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

News November 20, 2025

SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.