News February 20, 2025

పాడేరు: సరళ కార్యక్రమంలో 80 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

image

సరళ కార్యక్రమంతో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పెదబయలు, ముంచంగిపుట్టు, మంప, సీలేరు తదితర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన 80 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఇందులో 60 మంది ఎంపికయ్యారు. వీరికి సీఈఎంఎస్ సంస్థ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు. 

Similar News

News November 17, 2025

నస్రుల్లాబాద్: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

image

నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎంలో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. డీసీఎంను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News November 17, 2025

సిద్దిపేట: వ్యర్థాలతో కలుషితమవుతున్న చెరువులు

image

మాంస, వైద్య వ్యర్థాలను చెరువుల్లో ఇష్టానుసారంగా పారవేయడం వలన జలాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్న సంఘటనలు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల నెలకొంటున్నాయి. చెరువులు చెత్తా చెదారాలతో కలుషితమై దుర్వాసనలు వెదజల్లుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులపై అధికారులకు పట్టింపు లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

News November 17, 2025

NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCL<<>>)లో 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు GATE -2025 అర్హత సాధించినవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.560. SC,ST,PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://neepco.co.in