News January 27, 2025
పాడేరు: స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులకు సన్మానం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాడేరులో జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులను అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు. హుకుంపేట మండలంలోని మెలియాపుట్టు గ్రామానికి చెందిన మోరి చిన్నయ్య, డీ.చింతల వీధి గ్రామానికి చెందిన కొర్రా విశ్వనాథాన్ని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ బార్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం: ఛైర్మన్

శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. బుధవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7 వరకు స్పర్శ దర్శనాన్ని సాధారణ భక్తులకు రద్దు చేశామన్నారు. శివ స్వాములకు మాత్రం విడతల వారీగా దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరికీ సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించటమే తన ధ్యేయమన్నారు.
News December 3, 2025
రైల్వే ట్రాక్ పై నాటు బాంబు ఘటనపై ఎస్పీ క్లారిటీ

కొత్తగూడెం రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటు బాంబును కొరికి ఒక కుక్క మృతి చెందినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుంచి కుక్క తినే పదార్థం అని భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటు బాంబును ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ఎవరూ కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
News December 3, 2025
సమ్మిట్కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.


