News April 25, 2024
పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.
Similar News
News January 8, 2026
కర్నూలులో రూ.16,699 పలికిన ధర

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మిర్చి సూపర్-10 రకం క్వింటా రూ.16,699 పలికింది. మిర్చి-5 రకం రూ.16,599, మిర్చి బాడిగ రకం రూ.15,809కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కందులు క్వింటా గరిష్ఠ ధర రూ.7,249, కనిష్ఠ ధర రూ.1,669 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ. 8,700, మినుములు రూ.7,569, మొక్క జొన్నలు రూ.1,849, ఆముదాలు రూ.6,104 పలికాయి.
News January 7, 2026
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.
News January 6, 2026
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.


