News January 27, 2025

పాతబస్తి మెట్రో కోసం.. భగాయత్ లేఅవుట్ల వేలం..!

image

HYD ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిధులను MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే 7.5KM పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మెట్రో మార్గంలో ఉండే సుమారు 100 మత, వారసత్వ, సున్నిత నిర్మాణాలను పరిరక్షించేందుకు మెట్రో రైలు సంస్థ ఇంజనీరింగ్ పరిష్కారాలను డెవలప్ చేసింది.

Similar News

News February 24, 2026

హోలీ పండుగ ఎప్పుడంటే?

image

ఈ ఏడాది హోలీని ఏ తేదీన(మార్చి 3 or 4) జరుపుకోవాలన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ధ్రుక్ పంచాంగం ప్రకారం హోలికా దహనం మార్చి 3న, రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2న సాయంత్రం 5.55 నుంచి మార్చి 3 సా.5.07 వరకు ఉంటుందంటున్నారు. అయితే 3వ తేదీన చంద్ర గ్రహణం ఉండటం వల్ల 4న పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News February 24, 2026

విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మురళి నగర్ జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న వ్యక్తిని విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడకక్కడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 24, 2026

పంటల్లో బోరాన్ లోపం – కనిపించే లక్షణాలు

image

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపం వల్ల మొక్కల చిగుర్లు వికృతాకారంలో
మారతాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి.