News July 22, 2024
పాతబస్తీ బోనాల జాతరకు గవర్నర్ రాధాకృష్ణకు ఆహ్వానం

HYD పాతబస్తీలోని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ సోమవారం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీశ్, రాజారత్నం కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈనెల 18వ తేదీన ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభించామని తెలిపారు.
Similar News
News December 2, 2025
GHMC: దీర్ఘకాలిక సేవల కోసం HMWSSB ప్రణాళికలు

GHMCలో శివారు మున్సిపాలిటీల విలీనంతో HMWSSB పరిధి కూడా పెరగనుంది. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ తన సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో తాగునీరు, సీవరేజ్, డ్రైనేజి లైన్ నిర్వహణ భారంగా మారనుంది. కొత్తగా లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, పాతవాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2047 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
News December 2, 2025
HYD: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వస్తున్న ఇండిగో (6e 1234) విమానానికి బాంబు బెదిరింపు మేయిల్ వచ్చింది. అర్దరాత్రి 1:30 నిమిషాలకు బయలుదేరిన విమానం ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు విమానం చేరుకుంది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు. ముంబయిలో ఇంకా ల్యాండింగ్ కానీ విమానం భయం గుప్పెట్లో ఫైలెట్ తోపాటు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
News December 2, 2025
HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్కు చెందిన ధనుంజయ్ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా


