News April 3, 2025

పాన్‌గల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. రేమద్దులకి చెందిన పర్వతాలు(47)కి ఐదెకరాల పొలం ఉంది. ఆ పొలం అంచున ఓ కాల్వ ఉండగా.. అందులో నుంచి మోటార్ ద్వారా పంటకు నీరు పారిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కరెంట్ లేదనుకుని మోటార్‌లో పట్టిన నాచును తొలగిస్తుండగా.. విద్యుత్ సరఫరా అయ్యి మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 7, 2025

చొప్పదండి జవహర్ నవోదయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

image

జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. తమకు, విద్యాలయానికి ఉన్న ఆత్మీయ, అనుబంధ, మధురస్మృతులను విద్యార్థులతో పంచుకున్నారు. ప్రిన్సిపల్ కె.బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చాయని, దీనికి పూర్వ విద్యార్థులే నిదర్శమని అన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె.వి.ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 7, 2025

బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

image

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

News December 7, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ ఎన్నికల వ్యయ పరిమితులు అమలు చేయాలి: ఎన్నికల వ్యయ పరిశీలకులు
✓ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
✓ మణుగూరు: BRS ప్రచార వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
✓ దమ్మపేట: కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన 45 కుటుంబాలు
✓ ఓటును నోటుకు మధ్యానికి అమ్ముకోవద్దు: పినపాక ఎస్సై
✓ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: భద్రాచలం ఎస్సై
✓ అశ్వరావుపేట: గుండెపోటుతో యూటీఎఫ్ నాయకుడు మృతి