News April 5, 2025
పాన్గల్: చెరువులో మృతదేహం లభ్యం

ఓ 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మండల కేంద్రంలోని పొల్కి చెరువులో లభ్యమైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ఈ వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. ఆయన చనిపోయిన స్థలంలో చెప్పులు, శాలువా, కల్లు ప్యాకెట్ కనిపించాయి. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ఘటనను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 19, 2025
మృతి చెందిన మావోయిస్టుల వీరే..

ఆపరేషన్ సంభవ్లో భాగంగా మారేడుమిల్లి అటవీప్రాంతంలో మంగళవారం ఆరుగురు, బుధవారం ఏడుగురు మావోయిస్టులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బుధవారం మృతి చెందిన మెట్టూరి జోగరావు @టెక్ శంకర్, జ్యోతి @సరితా, సురేష్@రమేష్, లోకేష్@గణేష్, సైను@వాసు, అనిత, షమీల మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరాయి. మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల చిత్రాలు పైన చూడొచ్చు.
News November 19, 2025
వనపర్తి జిల్లాలో TODAY…టాప్ NEWS

* శ్రీరంగపురం: రంగసముద్రం రిజర్వాయరులో భారీ కొండచిలువ పట్టివేత
* వనపర్తి: జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
* పానగల్: ధాన్యం తేమశాతం గుర్తింపుపై ఐకెపి సిబ్బందికి శిక్షణ
* ఆత్మకూరులో పని చేయని ఏటీఎం మిషన్లు: వినియోగదారులు
* అమరచింత: కాలిపోయిన పత్తి… నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం
* బోరుకు కుళాయి ఏర్పాటు చేయండి
News November 19, 2025
HYD: శంషాబాద్లో యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన HYD శంషాబాద్లో ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వర్ధమాన్ కాలేజీలో చదువుతున్న రోహిత్(21), రామటెంకి సిద్ధార్థ(21) మంగళవారం రాత్రి బైక్పై వెళ్తుండగా శంషాబాద్ పరిధి నర్కుడ గ్రామంలో ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధార్థ అక్కడికక్కడే మరణించగా తీవ్రగాయాలైన రోహిత్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


