News March 28, 2025

‘పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా అభివృద్ధి’ 

image

పాపికొండల నుండి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా హోటల్స్ ఏర్పాటుచేయడం, పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బట్రస్ డ్యాం పూర్తికి రూ.82 కోట్ల ఖర్చు అవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 886 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని సీఎంకి వివరించారు.

Similar News

News April 17, 2025

పాలమూరు యూనివర్సిటీలో సకోర అభియాన్ కార్యక్రమం

image

సకోర అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేశ్ బాబు పక్షులకు నీటి తొట్లు అందించి జీవారణాన్ని కాపాడాలన్నారు. పీజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వచ్చే ఎండాకాలంలో పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందిస్తూ ప్రాణకోటిపై దయా హృదయంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు అంతమవడానికి పరోక్షంగా మానవాళి చర్యలే కారణమన్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News April 17, 2025

కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

image

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్‌ గురువారం మద్యప్రదేశ్‌లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.

News April 17, 2025

ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సాయంత్రం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషికి నంద్యాల, కర్నూలు ఎంపీలు బైరెడ్డి శబరి, నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీజీ వెంకటేష్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురంలోని గ్రీన్ కో ప్రాజెక్ట్, అహోబిలంలో ఆయన పర్యటించనున్నారు.

error: Content is protected !!