News March 31, 2025
పాపిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో గుడికి వెళ్లి వస్తున్న సమయంలో ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న గొడవలో లింగమయ్య అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ పాపిరెడ్డిపల్లి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. గొడవలకు దారి తీసిన కారణాలను మృతుని కుటుంబ సభ్యుల ద్వారా ఆరా తీశారు. మృతికి కారకులైన బాధ్యులపై అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News December 10, 2025
HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్లైన్, ఆన్లైన్లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.
News December 10, 2025
ఏలూరులో AI ల్యాబ్లు: MP

ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు MP పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు ఖర్చు సమకూర్చాలని ONGC సంస్థతో మాట్లాడి ఒప్పించినట్లు పేర్కొన్నారు. MP విజ్ఞప్తి మేరకు CSR కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
News December 10, 2025
ఎన్నికల రోజు స్థానిక సెలవు: జిల్లా కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో 5 మండలాల పాఠశాలకు సెలవులు ప్రకటించారు.


