News April 6, 2025

పాపిరెడ్డి గ్రామానికి రానున్న వైఎస్ జగన్.. రూట్‌మ్యాప్ ఇదే 

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8న రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో సీకే పల్లి చేరుకుంటారు. 10:50కి సీకే పల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.05 గంటలకు పాపిరెడ్డి గ్రామానికి చేరుకుంటారు. 11.10 వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30కి బెంగళూరుకి తిరుగు పయనమవుతారు. 

Similar News

News November 21, 2025

సిద్దిపేట: ‘మారేడుమిల్లి ఘటనపై విచారణ చేయాలి’

image

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా, అతని సహచరి రాజక్క (రాజే) సహా పలువురి మరణంపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.

News November 21, 2025

నాగర్‌కర్నూల్ నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్

image

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. బదిలీల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రంగనాథ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సంగ్రామ్ సింగ్ పాటిల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News November 21, 2025

మేడికొండూరు: నిన్న కూతూరి పెళ్లి.. ఇవాళ గుండెపోటుతో తండ్రి మృతి

image

నిన్నటి పెళ్లి పందిరిలో సందడి ఇంకా ముగియక ముందే మేడికొండూరు మండలం డోకిపర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంగా సీనియర్ పాత్రికేయుడిగా సేవలందిస్తున్న దావాల వెంకట రావు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిన్ననే తన కూతురి వివాహాన్ని జరిపించి, ఆ ఆనందంలో ఉండగానే విధి ఇలా చిన్నచూపు చూసింది. మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.