News June 5, 2024

పామర్రు: నాడు తండ్రిని ఓడించారు.. నేడు కొడుకును గెలిపించారు

image

2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

Similar News

News September 29, 2024

రేపు ప్రజావేదికలో ఫిర్యాదులు స్వీకరించనున్న మంత్రి అనిత

image

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. రేపు ప్రజావేదికలో మంత్రి అనిత వంగలపూడి, టీడీపీ సీనియర్ నేత BT నాయుడు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని పల్లా శ్రీనివాస్ తన అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేశారు.

News September 29, 2024

పేకాట స్థావరాలపై దాడులు చేస్తున్నాం: కృష్ణా జిల్లా పోలీసులు

image

కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించి పేకాట స్థావరాలపై దాడులు చేశామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ.. పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకుని పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపింది.

News September 29, 2024

పులిగడ్డ-పెనుముడి వారధిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ-పెనుమూడి వారిధిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. రేపల్లె నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్‌ను ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.