News April 16, 2025
పామిడి విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన పామిడి యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
Similar News
News April 19, 2025
కామారెడ్డి: కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి: SP

నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News April 19, 2025
నిర్మల్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 19, 2025
సిద్దిపేట: ఫోన్ పట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు: హరీశ్ రావు

విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేయొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘భద్రంగా ఉండాలి- భవిష్యత్తులో ఎదగాలి’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెలవుల్లో పుస్తక పఠనం చేసి తెలియని వాటిని తెలుసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటే మనకే నష్టమని అన్నారు.