News July 17, 2024
పామిడి: విద్యుత్ శాఖ లైన్మెన్లపై దాడి.. కేసు

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు లైన్మెన్లపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. కరెంటు బిల్లుల వసూళ్లలో భాగంగా పామిడి మండలం దిబ్బసానిపల్లికి సీనియర్ లైన్మెన్ కృష్ణానాయక్, జూనియర్ లైన్మెన్ స్టీఫెన్ వెళ్లారు. ఆ సమయంలో రంగేశ్ వారిపై దుర్భాషలాడుతూ చెప్పులతో దాడికి తెగబడ్డినట్లు ఏఈ మధుసూదన్ రావుతో కలిసి పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 11, 2025
వరల్డ్ కప్లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్గా టీమ్కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 11, 2025
వరల్డ్ కప్లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్గా టీమ్కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.


